మోదీ అవిశ్రాంత సేవను కొనియాడుతూ భావోద్వేగానికి లోనైన పవన్ కళ్యాణ్..

భోగాపురం : అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశం కోసం చేస్తున్న నిరంతర సేవలను ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడిన సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు.

ప్రసంగంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ సేవ కోసం అలుపెరుగని కృషి చేస్తున్నారని, బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడిగా ఆయనను అభివర్ణించారు. మోదీపై వ్యక్తిగత విమర్శలు, దాడులు తనను తీవ్రంగా కలిచివేస్తాయని కూడా పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సభలో ఉన్న పలువురు నాయకులు, కార్యకర్తలను భావోద్వేగానికి గురి చేశాయి. మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆయన ప్రసంగానికి మద్దతుదారులు అభినందనలు తెలియజేయగా, మరోవైపు విమర్శకులు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *